AP : నిరసనలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము : ఉద్యోగ సంఘాలు

AP : నిరసనలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము : ఉద్యోగ సంఘాలు
మా సమస్యల పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది : ఉద్యోగ సంఘాలు
ప్రభుత్వం నమ్మకం చేస్తుందన్న నమ్మకం మాకు ఉంది : ఉద్యోగ సంఘాలు
ఉద్యోగ సంఘాల సమస్యల ను దశల వారీగా పరిష్కరిస్తాం : బుగ్గన
అమరావతి:మేం పెట్టిన 71 డిమాండ్లపై మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మతో చర్చించాం. బుధవారం నుంచి డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీతో ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం-బండి, ఏపీ జేఏసీ ఛైర్మన్

 

AP : నిరసనలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము : ఉద్యోగ సంఘాలు

వెనక్కి తగ్గిన ఉద్యోగ సంఘాలు AP: కొన్ని రోజులుగా PRC విషయంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చలు ఫలించాయి. ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వ హామీతో ఆందోళన విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టతనివ్వడంతో వీరు వెనక్కి తగ్గారు. మరోసారి సమావేశమై దశలవారీగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది.
అమరావతి: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు జేఏసీల నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నామని.. కొవిడ్ సహా వివిధ అంశాల వల్ల ఈ అంశాల పరిష్కారం ఆలస్యం అయిందన్నారు. ప్రభుత్వం అనేది ఓ కుటుంబం, ఉద్యోగులు కూడా అందులో భాగమని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. దశల వారీగా వారిచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బుధవారం సీఎస్ సమీర్‌శర్మతో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుందని.. తానే స్వయంగా పర్యవేక్షిస్తాని బుగ్గన తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై 9 సంఘాలు ఉద్యమం చేస్తున్నాయని, వారిని విరమించాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నట్లు తెలిపారు. డిమాండ్లను పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వేర్వేరుగా చర్చలు జరిపింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్‌సీ సహా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన 71 అంశాలపై భేటీలో ప్రధానంగా చర్చించారు.
డిమాండ్లను మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం: వెంకట్రామిరెడ్డి
‘‘ఉద్యోగుల డిమాండ్లను మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏపీ సచివాలయానికి సంబంధించి 11 అంశాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 85 అంశాలు నివేదించాం. సచివాలయంలో అదనపు పోస్టులను భర్తీ చేయాలని కోరాం. కోర్టు కేసులు ఎక్కువ అవుతున్నందున అదనపు పని భారం పెరిగింది. అసెంబ్లీ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లాల్లో ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరాం. వీఆర్వోలకు పదోన్నతులు ఇచ్చినా గ్రేడ్-2 స్కెల్‌నే అమలు చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం’’ అని తెలిపారు.

దురుద్దేశంతో ఉద్యమ కార్యాచరణకు వెళ్లలేదు: బొప్పరాజు
‘‘మా సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 71 అంశాలపై కూలంకషంగా చర్చించాం. ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పింది. ప్రభుత్వ హామీతో ఉద్యమ కార్యాచరణ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. దురుద్దేశంతో ఉద్యమ కార్యాచరణకు వెళ్లలేదు. ఇవాళ్టి భేటీ మినిట్స్‌ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నెల 7 నుంచి ఉద్యోగులంతా ఆందోళనతో ఉన్నారు. ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం’’ అని పేర్కొన్నారు.