JAV Jagananna Ammavodi Laptops for 9-12th Class - Guidelines - Willingness Letter
పాఠశాల విద్యా శాఖ - "నవరత్నాలు” - జగనన్న అమ్మఒడి పథకం - 9 -12 తరగతుల విద్యార్ధులకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ లు అందించుట గూర్చి-ఇందు మూలముగా తగు సూచనలు జారీ చేయటం-గురించి
విషయం : పాఠశాల విద్యా శాఖ - "నవరత్నాలు” - జగనన్న అమ్మఒడి పథకం - 9 -12 తరగతుల విద్యార్ధులకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ లు అందించుట గూర్చి-ఇందు మూలముగా తగు సూచనలు జారీ చేయటం-గురించి.,
సూచిక:
JAV Jagananna Ammavodi Laptops for 9-12th Class - Guidelines - Willingness Letter
రేఖా సంఖ్య :ఇ.ఎస్.ఇ02-28021/27/2020-ప్లానింగ్ తేది : 31-3-2021విషయం : పాఠశాల విద్యా శాఖ - "నవరత్నాలు” - జగనన్న అమ్మఒడి పథకం - 9 -12 తరగతుల విద్యార్ధులకు అమ్మఒడి పథకం ద్వారా నగదు బదులు లాప్ టాప్ లు అందించుట గూర్చి-ఇందు మూలముగా తగు సూచనలు జారీ చేయటం-గురించి.,
సూచిక:
1) ఈ కార్యా లయ ప్రొసీడింగ్స్ ESE02-28021/27/2020-PLG-CSE, తేదీ : 09.12.2020 2) ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య. 63 పాఠశాల విద్యా శాఖ (ప్రోగ్రాం:
2) తేదీ: 28-12-2020 3) ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య. 79, పాఠశాల విద్యా శాఖ (ప్రోగ్రాం: 2) తేదీ:. 4.11.2019
ఆదేశములు:
ఆదేశములు:
- రాష్ట్రములోని అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాధికారులకు తెలియ చేయునది ఏమనగా, పైన సూచించిన సూచికలు 2 మరియు 3 ల నందు "నవరత్నాలు” లో భాగంగా “జగనన్న అమ్మ ఒడి' పథకం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2019-20 మరియు 2020-21 సంవత్సరాలకు గాను అర్హులైన 1 వ తరగతి నుండి 12 వ తరగతి (ఇంటర్ మీడియట్ ) చదువుచున్న విద్యార్థుల తల్లికి లేదా గుర్తించబడిన సంరక్షకుల వారికి సంవత్సరానికి రూ.15,000 / - ఆర్థిక సహాయం అందిస్తున్నది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న అందరికి నాణ్యమైన విద్యకు గాను భరోసా ఇవ్వడంతో పాటు విద్యార్థుల హాజరుని నిరంతరం పరిశీలిస్తూ వారు మెరుగైన అభ్యాసన ఫలితాలను సాధించడం కోసం 1 నుండి 12 (ఇంటర్మీడియట్ విద్య) తరగతుల వరకు పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి గాను అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు పరుస్తూ ఉన్నది.
- 2. కాగా, రానున్న విద్యాసంవత్సరం నుండి, అనగా, 2021-22 సంవత్సరం నుండి, అమ్మఒడి పథకం ద్వారా అర్హులైన 9 -12 తరగతుల విద్యార్థుల తల్లులకు వారి విద్యార్థుల విద్యావికాసం కోసం ఎవరైనా తల్లులు నగదు బదులు లాప్ టాప్ లు కోరుకున్నట్లయితే వారికి లాప్ టాపులు అందించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికీ తెలియపరిచి, వారు అమ్మ ఒడి కింద సహాయం నగదు రూపేణా కోరుకుంటున్నారా లేక లాప్ టాప్ ల రూపేణా కోరుకుంటున్నారా తెలుసుకోవటం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రిగారు తల్లుల్ని ఉద్దేశించి ఒక లేఖ రాసారు. ఆ లేఖ ప్రతిని దీనివెంట జతపరుస్తున్నాం.
- 3. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఉత్తరమును అమ్మఒడి పథకం కింద అర్హులైన 9-12 విద్యార్థుల తల్లులందరికీ అందిస్తూ, వారి అభీష్టం తెలుసుకుని తిరిగి ప్రభుత్వానికి తెలియపరచటం కోసం అందరు జిల్లా విద్యాశాఖాదికారులు మరియు ప్రాంతీయ విద్యా శాఖాది కారులకు ఈ క్రింది సూచనలు ఇవ్వడమైనది.
- అ) ఈ ఉత్తర్వులకు పి. డి. ఎఫ్ . రూపములో జతపరిచిన సదరు లేఖను డి.సి. యి . బి. ల ద్వారా 10-4-2021 లోపుగా ముద్రించాలి.
- ఆ) ఆ విధంగా ముద్రించిన లేఖను మండల విద్యా శాఖాదికారుల ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు కళాశాలల ప్రిన్సిపాళ్ళకు విద్యార్ధుల సంఖ్య ను అనుసరించి 154-2021 లోపుగా అందించాలి.
- ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు మరియు కళాశాలల ప్రధా నాచార్యులు అందరు కూడా తమ విద్యాసంస్థల్లో 9 నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో 19-4-2021 న సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి లేఖలోని అంశాలను విద్యార్ధులకు చక్కగా విశదీకరించాలి. విద్యార్ధులు ఆ లేఖను ఇంటికి తీసుకునివెళ్ళి తమ తల్లులకు లేదా సంరక్షకులకు చూపించి వారి అభీష్టాన్ని తెలుసుకుని ఆ లేఖపైన రాయించి తిరిగి ఆ లేఖను 22-4-2021 నాటికి ప్రధానోపాధ్యాయులకు అందచెయ్యాలి.
- ఆ విధంగా విద్యార్థులు తమకు తిరిగి ఇచ్చిన అంగీకార పత్రములోని అంశాలను ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులు మరియు కళాశాలల ప్రధా నాచార్యులు స్వీయ పర్యవేక్షణలో అమ్మ ఒడి వెబ్ సైటు నందు 26-4-2021 లోపుగా పొందుపరచాలి. ఆ విధంగా పొందుపరిచిన తర్వాత, ఆ అంగీకారపత్రాలను పాఠశాల, కళాశాల రికార్డులో భద్రపరచాలి.