Telangana CM KCR announced 30 PRC Fitment in Assembly - TS PRC 2021 News

Telangana CM KCR announced 30 PRC Fitment in Assembly - TS PRC 2021 News
కేసీఆర్ పీఆర్సీ ప్రకటన..ముఖ్యాంశాలు
TS PRC.అసెంబ్లీలో KCR ప్రకటన.....
30 శాతం Fitment
1.4.2021 నుండి అమలు...
Gratuity 16 లక్షలు.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సం...
ప్రమోషన్ ల ప్రక్రియ మొదలవుతుంది..
EHS పై స్టీరింగ్ కమిటీ ఏర్పాటు..
10000 కు LFL HM పోస్ట్స్ పెంపు ..
అంతర్ రాష్ట్ర బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Telangana CM KCR announced 30 PRC Fitment in Assembly - TS PRC 2021 News

శాసనసభలో సీఎం కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. దీనిపై అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్‌ నివేదిక ఇచ్చిందని చెప్పారు.
Watch the PRC Fitment Announcement 

శాసనసభలో పీఆర్సీపై ప్రకటన చేసిన కేసీఆర్‌

 రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి పీఆర్సీపై ప్రకటన చేశారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. దీనిపై అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్‌ నివేదిక ఇచ్చిందని చెప్పారు. సీఎస్‌ అధ్యక్షతన కమిటీ నివేదికపై అధ్యయనం చేసిందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా సీఎస్‌ కమిటీ చర్చించిందని గుర్తుచేశారు.

పీఆర్సీ ప్రకటనలోని ముఖ్యాంశాలు..
* ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు, హోంగార్డులకు పీఆర్సీ వర్తింపు
* అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, సెర్ప్‌ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు, వీఆర్‌ఏ,వీఏవోలకు పీఆర్సీ
* పదవీ విరమణ వయో పరిమితి 61 ఏళ్లకు పెంపు. ఈ పెంపు తక్షణమే వర్తింపు.
* ఉద్యోగులు కోరిన విధంగానే పదోన్నతుల ప్రక్రియ. 80 శాతం ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి. అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు. ఈ ప్రక్రియ సత్వరమే ప్రారంభం
* పదోన్నతుల తర్వాత ఏర్పడే ఖాళీలు త్వరలోనే భర్తీ
* విశ్రాంతి ఉద్యోగులు పూర్తిస్థాయి పింఛను పొందే అర్హత వయసు తగ్గింపు. 75 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు తగ్గింపు.
* అర్హులైన ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు, బదిలీలు. ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు. యాజమాన్యాల వారీగా ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు.
* ఉద్యోగులు, ఉపాధ్యాయుల అంతర్‌జిల్లాల బదిలీలు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా అంతర్‌ జిల్లాల బదిలీలు. ఒకే యూనిట్‌, ఒకే మండలంలో భార్యాభర్తలు పనిచేసేలా బదిలీలు.
* ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి
* కేజీబీవీలో మహిళా సిబ్బందికి కొత్తగా వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు.