JAGANANNA AMMA VODI 2022 UPDATES -AMMAVODI Doubts Clarifications

అమ్మఒడి అప్డేట్: Jagananna AMMA VODI is the welfare scheme which provides financial assistance to unique mothers for providing educational facilities to their wards. An amount of Rs 15000 per academic year will be given by the Government of Andhr Pradesh. It has been introduced as a prt of Navaratnalu. All AMMAVODI 2022 Related Updated posted Here. Day wise updates on Amma Vodi 2022, AMMAVODI 2022 Laptops Updates all Related Information available Here. Students, Mothers, Parents can view this page frequently to know the Updates on AMMA VODI 2022 జగనన్న అమ్మఒడి 2022 అప్డేట్ -

AMMA VODI 2022 UPDATES అమ్మఒడి 2022 అప్డేట్

The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each mother or recognized guardian in the absence of mother, who is below poverty line household, irrespective of caste, creed, religion and region to enable her to educate her child/children from Class I to XII (Intermediate Education) in all recognized Government, Private Aided and Private Unaided schools/ Jr. Colleges including Residential Schools/Colleges in the State from the Academic year 2020-2021. The Latest Updates of JAGANANNA AMMAVODI for 2022 are as follows:
Join Our Telegram News Channel for Latest Updates: https://t.me/APTEACHERS


𝐀𝐌𝐌𝐀 𝐕𝐎𝐃𝐈 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 24.5..2022
UPDATE-1 Date 24.5.2022


అమ్మఒడి Ekyc చేయడానికి పేర్లు రాకపోతే Beneficiary outreach App లో ఉన్న search ఆప్షన్ లో చూడండి.. ఆలా కూడా రాకపోతే WEA/ WDS లాగిన్ లో Navasakam beneficiary management లో View Eligibility ఆప్షన్ లో మీకు సంబందించిన Scheme పేరు Select చేసుకోని check చేస్తే వాళ్ళ names ఎందుకు రాలేదు అనేది Reason చూపిస్తుంది...Names which did not came means they may be may failed in six-step validation process.


UPDATE-2 Date 24.5.2022
అమ్మఒడి కు సంబందించి Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో తల్లుల బయోమెట్రిక్ తీసుకునే సమయం లో *"చెల్లుబాటు అయ్యే మదర్ ఆధార్ సంఖ్యను నమోదు చెయ్యండి"* అని వస్తున్నట్టు అయితే *"స్కూల్ / కాలేజీ లో స్టూడెంట్ డీటెయిల్స్ నమోదు చేసే సమయం లో వివరాలు తప్పుగా నమోదు అయ్యి ఉండవచ్చు"* కావున వివరాలు స్కూల్ / కాలేజీ లో సరి చూసుకొని సచివాలయం లో PS Gr-VI(DA) / WEDPS వారి GSWS పోర్టల్ లో *"Navasakam Beneficiary Management System"* లో *"Check Status & Create Grievance"* ఆప్షన్ లో తల్లి / గార్దియన్ ఆధార్ నెంబర్ తో *"Invalid Child / Mother / Guardian Aadhar"* లో అర్జీ నమోదు చేయగలరు.
*Note :*  తుది జాబితాలు ఇంకనూ విడుదల చెయ్యలేదు.

UPDATE-3 Date 24.5.2022 అమ్మఒడి Grievances 
☛ అమ్మఒడి status check చేసుకోని grievance పెట్టడానికి Navasakam beneficiary management New అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
Grievances ఎవరికీ పెట్టాలి అంటే...
☛ తల్లి / విద్యార్థి / సంరక్షకుడు ఆధార్ నెంబర్ తప్పు గా ఉన్నపుడు.
☛ విద్యార్థి / తల్లి కి అసలు రైస్ కార్డు లేకపోయినా
☛ విద్యార్థి / తల్లి ఒకే house హోల్డ్ mapping లేకపోయినా
☛ విద్యార్థి / తల్లి అసలు హౌస్ హోల్డ్ mapping లో లేకపోయినా
☛ విద్యార్థి / తల్లి ఒకే రైస్ కార్డు లో లేకపోయినా
☛ గవర్నమెంట్ employee ( ఒకవేళ ఇలాంటి names వస్తే )
☛ విద్యార్థి / తల్లి తప్పుగా mapping చేయబడిన..
☛ Age , caste , electricity , four wheeler , gender etc.. ఈ ఆప్షన్స్ నుంచి మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని grievance raise చేసుకోవచ్చు...
అమ్మఒడి grievances మరియు Ekyc problems మీద WEA's కి conference ద్వారా instructions ఇవ్వడం జరుగుతుంది.

AMMA VODI NEWS 24th May 2022
జూన్ 21న అమ్మఒడి?
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే ప్రాసెస్
 పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలున్నా ఓకే

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి 'జగనన్న అమ్మఒడి' నిధు లు జూన్ 21న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్నారు. అందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెనిఫిషియరీ అవుట్ రీచ్ మొబైల్ అప్లికేషన్లో పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు లబ్ధిదారుల అర్హతలు ఉన్నాయా లేదా అనేవి సేకరిస్తున్నారు. అమ్మఒడికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నుంచి కేవలం హాజరు వివరాలు) మాత్రమే అందించనుంది. మరోవైపు లబ్ధిదారులు నివాసాల్లో కరెంట్ బిల్లులు 300 యూనిట్లు దాటాయా లేదా అనే వివరాలతోపాటు, వారికి ఉన్న రేషన్ కార్డు, వాహనాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 42 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ ఊళ్లకు వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమ్మఒడిలబ్దిదారుల జాబితాలకు సం బంధించిన మూడు జాబితాలను గ్రామ, వార్డు సచివాల యాల ఉద్యోగులే సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ పథకం కింద తప్పుగా నమోదైన విద్యార్థి వివరాల సవర ణలకూ ఒక దరఖాస్తు రూపొందిం చినమోదు చేస్తున్నారు.

దరఖాస్తుల ద్వారా వివరాల సేకరణ..
అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దేనికి సంబంధించిన వారు, జిల్లా, మండలం, విద్యార్థి చదువుతున్న స్కూల్ వివరాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నమోదు చేస్తున్నారు. వివరాలు తప్పుగా ఉన్న విద్యార్ధులకు సంబంధించి రేషన్ కార్డు నంబర్, తల్లి, సంరక్షకుల పేరు, ఆధార్లతోపాటు విద్యార్థుల ఆధార్, స్కూల్ యూడైన్ కోడ్, బ్యాంక్ ఖాతాల వివరాలను దరఖాస్తుల ద్వారా సేకరిస్తున్నారు.

పోస్టల్ బ్యాంకు ఖాతాలకూ..
అమ్మఒడి పథకం నిధులు జమ చేసేందుకు ప్రస్తుతం విద్యార్థుల తల్లులకు బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తు న్నారు. దీనికి అదనంగా ఈ ఏడాది నుంచి పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలున్నా వాటిలో జమ చేయాలని ప్రభు త్వం నిర్ణయిం చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఆమోదిస్తా మని సర్క్యులర్ విడుదల చేశారు.

పోస్టల్ బ్యాంక్ ఖాతాలు జీరో అకౌంట్లు కావడంతో లబ్ధిదారులు ఎలాంటి కనీస మొత్తం లేకుండా ఖాతాలు తెరిచి, ఉపయోగిం చుకోవచ్చు. ఈ మేరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి విద్యాశాఖ మంత్రికి ఒక లేఖ కూడా రాశారు. అలాగే రెగ్యులర్ బ్యాం కుల్లో ఏ విధంగా వివిధ రకాల నగదు జమ చేస్తారో.. ఆసౌకర్యాలన్నీ పోస్ట్బ్యంకులో కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు ఈ సదుపాయం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.


🔰 𝐀𝐌𝐌𝐀 𝐕𝐎𝐃𝐈 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 23.5..2022
  • 2022-23 విద్యా సంవత్సరంలో అమ్మ ఒడి నగదు నుంచి 2 వేలు మినహాయింపు.
  •  టాయిలెట్స్ నిర్వహణ, పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు ఈ నగదు మినహాయించి 13 వేలు జమ చేయనున్న ప్రభుత్వం.
  • ప్రాథమికంగా అర్హత సాధించిన వారి అర్హుల జాబితా,విద్యార్థులు నివసిస్తున్న గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి యాప్ ద్వారా ఇవ్వటం జరిగినది,
  • ఆ యాప్ లో విద్యార్థి యొక్క తల్లి బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది
  • విద్యార్థి యొక్క తల్లిగారి బ్యాంకు ఎకౌంటు ఆధార్ కార్డు తో NPCI లింక్ చేసి ఉండవలెను
  • అమ్మ ఒడి కి సంబంధించి అర్హత ఉన్నా కూడా పేరు రానియెడల సెర్చ్ ఆప్షన్ ద్వారా చూసి బయోమెట్రిక్ వేయవలెను
  • ఎవరైనా విద్యార్థి యొక్క తల్లి మరణించిన యెడల వారి పేరు ఇప్పుడు బయోమెట్రిక్ వచ్చి ఉంటే అది తండ్రి పేరు మార్చుటకు త్వరలో సచివాలయం నందు ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది
  • విద్యార్థి యొక్క తల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే గ్రామ సచివాలయం నందు బయోమెట్రిక్ వేయవచ్చును.


Posted Date: 17.4.2022
అమ్మ ఒడి - సందేహాలు - సమాధానాలు

ప్రశ్న 
: బెనెఫిషరీ ఔట్రీచ్ యాప్ లో e-KYC కోసం వచ్చిన పేర్లులో కొంతమంది తల్లులు రైస్ కార్డు లో ఉన్నారు, కానీ పిల్లలు లేరు, e-KYC తీసుకోవచ్చా?
🔹సమాధానం :
ప్రస్తుతం ఉన్న సూచనల ప్రకారం, విద్యార్థులు రైస్ కార్డు లో తప్పనిసరిగా ఉండవలసిన అవసరం లేదు. తల్లుల e-KYC తీసుకోవచ్చు. -GSWS


1) అమ్మఒడి కి ఆధార్ కార్డ్ లో కొత్త జిల్లా పేర్లు మార్చుకోవాలా?
Ans: అవసరం లేదు, ప్రభుత్వం అలాంటి నిబంధన ఏమీ పెట్టలేదు.

2) అమ్మ ఒడి కి తల్లీ యెక్క బ్యాంకు ఖాతా కి ఆధార్ లింకు చేపించుకోవాలా?
Ans: అవును ఖచ్చితంగా తల్లీ/గార్డియన్ యెక్క ఆధార్ బ్యాంకు ఖాతా కి లింక్ చేసుకోవాలి.

3) ఆధార్ బ్యాంకు ఖాతా ఎక్కడ లింక్ చేసుకోవాలి?
ఖచ్చితంగా బ్యాంక్ లో మత్రమే లింక్ చేపించుకోవాలి, గ్రామ/వార్డ్ సచివాలయం లో చేయరు.

4) అమ్మ ఒడి కొసం ఆధార్, ఫోన్ నెంబరు లింక్ చేసుకోవాలా?
Ans: అవసరం లేదు, కానీ లింక్ చేసుకున్నట్లు ఐతే చాలా ఉపయోగాలు ఉంటాయి.

5) అమ్మ ఒడి కొసం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరి చూసుకోవాలా?
Ans:అవును మీ యెక్క వాలంటీర్ దగ్గరా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలు సరి చూసుకోవాలి ఉదా: తల్లీ మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్ లో ఉండాలి, వయస్సు, జెండర్ మొదలైనవి.

6) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వివరాలు సరిగా లేకపోతే ఏమీ చేయాలి?
Ans: వాలంటీర్ దగ్గర Ekyc చేసుకుంటే అప్డేట్ అవుతుంది.

7) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లీ మరియు స్టూడెంట్ ఓకే మ్యాపింగ్ లో లేకపోతే ఏమీ చేయాలి?
Ans: దీనికి అతి త్వరలో ఆప్షన్ ఇస్తారు.

8)అమ్మఒడి పొందటానికి అర్హత లు ఏమిటి?
Ans: విద్యార్థి హాజరు శాతం 75%, రైస్ కార్డు, కుటుంబం యొక్క మెట్ట భూమి 10ఎకరాల లోపు ఉండాలి, మాగాణి 3ఎకరాలా లోపు ఉండాలి, income tax కట్టి ఉండరాదు, కుటుంబం లో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు, విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించరాదు, పట్టణ ప్రాంతం లో 1000 SFT నివాస భూమి మించరాదు, 4వీలర్ కలిగి ఉండకూడదు (ట్యాక్సీ/ట్రాక్టర్ ఉండొచ్చు).

9) అమ్మ ఒడి ప్రాసెస్ సచివాలయం లో చేస్తారా?
Ans: లేదు, ప్రస్తుతం సచివాలయం లో అమ్మ ఒడి కి సంబంధించి ఎలాంటి లాగిన్ ఇవ్వలేదు, వివరాలకు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ ను కలవాలి

10) అమ్మ ఒడి ప్రక్రియ మొదలు పెట్టారా?
Ans: ప్రస్తుతం ఇంకా ప్రాథమిక స్థాయి లోనే ఉంది.


Posted Date: 11.4.2022
అమ్మఒడికి సంబంధించి ప్రస్తుతం గ్రామ సచివాలయంలో ఎలాంటి సర్వీస్ లు చేయడానికి అవకాశం లేదు.

అప్డేట్ చేసుకోవాల్సినవి..:
  • 1). తల్లి యెక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి. లింక్ అయినది లేనిది సంబంధిత బ్యాంక్ కి వెళ్లి సరిచూసుకోవాలి. లింక్ కాని యెడల సంబంధిత బ్యాంక్ లో మాత్రమే లింక్ చేసుకోవాలి, సచివాలయంలో చేయరు.
  • 2). హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్లో ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. ఇది మీ వాలంటీర్ దగ్గర సరిచూసుకోవాలి. సచివాలయంలో కాదు.*
  • 3). హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ యెక్క వివరాలు ఉదా: వయస్సు, జెండర్ మొదలైనవి సరిచూసుకోవాలి. సరిగా లేనియెడల వాలంటీర్ వద్ద HH app లో అప్డేట్ e-KYC ద్వారా అప్డేట్ చేసుకోవలెను. ఇది కూడ వాలంటీర్ వద్ద అందుబాటులో కలదు. సచివాలయంలో చేయరు.
ఇట్లు
సంక్షేమ మరియు విద్య సహాయకులు