UNESCO 2023 Report on Usage of Smart Phones in Schools Analysis

The 2023 Global Education Monitoring Report has just released a call for technology only to be used in class when it supports learning outcomes, and this includes the use of smartphones.

‘Put learners first’: Unesco calls for global ban on smartphones in schools
Major UN report issues warning over excessive use, with one in four countries already banning the devices

Analysis: distraction and bullying are key concerns
‘I would crank up the restrictions’: teachers on banning phones in school

The report shows that some technology can support some learning in some contexts, but not when it is over-used or inappropriately used. In particular, the use of smartphones can disrupt learning in classrooms. One study looking at pre-primary through to higher education in 14 countries found that it distracted students from learning. Even just having a mobile phone nearby with notifications coming through is enough to result in students losing their attention from the task at hand. One study found that it can take students up to 20 minutes to refocus on what they were learning once distracted.

Removing smartphones from schools in Belgium, Spain and the United Kingdom was found to improve learning outcomes, according to a study cited in the report, especially for students that were not performing as well as their peers.

UNESCO 2023 Report on Usage of Smart Phones in Schools Analysis

బడుల్లో స్మార్ట్ఫోన్లు వద్దు 
వాటితో చదువు, సంస్కారం నాశనం
ఉపాధ్యాయులకు.. 'డిజిటల్' ప్రత్యామ్నాయం కాదు 
యునెస్కో-2023 నివేదిక సిఫార్సులు

స్మార్ట్ఫోన్ చదువులకు తక్షణమే ఫుల్స్టాప్ పెట్టాలని ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) అన్ని దేశాలకు పిలువునిచ్చింది. వీటి వల్ల చదువులే కాకుండా సంస్కారం, విద్యార్థుల వ్యక్తిత్వం కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. 'విద్యారంగంలో సాంకేతికత-2023' పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో యునెస్కో ఈ సిఫార్సులు చేసింది. వీటి అమలుకు ఫ్రాన్స్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ అంగీకరించాయి.

కొవిడ్ సమయంలో ఇళ్లలోకి, బడుల్లోకి విచ్చలవిడిగా అడుగుపెట్టిన స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్ల వల్ల లాభం కంటే విద్యార్థులకు నష్టమే ఎక్కువ జరుగుతోందని యునెస్కో అధ్యయనం తేల్చింది. "మంచి టీచర్లను నియమించకుండా.. కేవలం కంప్యూటర్లు, వాటిలో రికార్డు చేసిన పాఠాలనిస్తే ఫలితం ఉండదు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవటంతో విద్యార్థుల్లో చదువు మాని పక్కచూపులు ఎక్కువయ్యాయి" అని స్పష్టం చేసింది. 

14 దేశాల్లో చదు వులపై స్మార్ట్ఫోన్ల ప్రభావాన్ని అధ్యయనం చేసిన యునెస్కో 435 పేజీల నివేదిక విడుదల చేసింది. విద్యార్థి కేంద్రంగా.. ఉపాధ్యాయులు ప్రధానంగా.. బోధన జరగాలని అందులో సిఫార్సు చేసింది. డిజిటల్ పరికరాల అతి వినియోగం వల్ల పిల్లల సంస్కారం, ప్రవర్తనపై దుష్ప్రభావం పడుతోందని.. సైబర్ వేధింపులు పెరిగా యని పేర్కొంది. అందుకే విద్యారం గంలో డిజిటల్ టెక్నా లజీని ప్రవేశ పెట్టడంలో జాగ్రత్తలు తీసుకోవా లని అన్ని దేశాల్లోని విద్యా ప్రణాళికవేత్త లను హెచ్చరించింది. అభ్యసనానికి పెద్దపీట వేస్తూ సాంకేతికతను నియంత్రించే పద్ధతులు పాటించాలని యునెస్కో సూచించింది. బోధనలో 30% మించి సాంకేతికతను వినియోగించ కుండా చైనాలో కట్టడి చేశారు.

విద్యార్థుల మెరుగుదలకు మాత్రమే సాంకేతికత ఉపయోగపడాలి. దానితోపాటు ఆన్లైన్ విద్య అనేది బోధనలో, అభ్యసనలో అదనపు వనరుగా ఉండాలి.
అంతేతప్ప ఉపాధ్యాయులకు అవి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. పిల్లలకు సాంకేతికతతోనే కాకుండా.. అది లేకుండా జీవించటం కూడా నేర్పాలి"
- ఆడ్రే అజూలే యునెస్కో డైరెక్టర్ జనరల్

ఇవీ దుష్పరిణామాలు

• స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లను తర గతి గదుల్లో అతిగా ఉపయోగించటం వల్ల విద్యార్థుల ధ్యాస, ఏకాగ్రత దెబ్బతింటోంది. 

* అతిగా సాంకేతికత వాడటానికి, విద్యార్థుల సామర్థ్యం దెబ్బతినటానికి, సంస్కారాలకు సంబంధం ఉందని ఇతర అంతర్జాతీయ అధ్యయనాల్లోనూ తేలింది.

• డిజిటల్ విద్యా సదుపాయాల వాడకంలో సగం కంటే ఎక్కువ దేశాల్లో ఉపాధ్యాయులకు సరైన తర్ఫీదు లేదు. సైబర్ భద్రత గురించి 5% మందికి కూడా అవగాహన లేదు.

• సాంకేతికత కారణంగా చదువు చాలామందికి చేరువైనా... డిజిటల్ అసమానతలూ పెరి గిపోయాయి. డిజిటల్ విద్యాసదుపాయాలు ఖరీదైనవి కావటమే ఇందుకు కారణం. 

• డిజిటల్ టెక్నాలజీ వల్ల చదువులు మెరుగు పడ్డాయని చెప్పటానికి బలమైన అధ్యయనం ఏదీ లేదు. డిజిటల్ సదుపాయాలను అమ్ముతున్న కంపెనీలే ఈ మేరకు కొన్ని సాక్ష్యా లను చూపుతున్నాయి. విద్యా ప్రణాళికలపై అలాంటి కంపెనీల ప్రభావం పెరుగుతుండటం ఆందోళనకరం.

• కొవిడ్ సమయంలో చదువులు దెబ్బతి నకుండా సాంకేతికతే ఆదుకుంది. కానీ అదే సమయంలో ఆధునిక సాంకేతిక సదుపాయాలు లేక కోట్ల మంది పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యారు కూడా.

యునెస్కో సిఫార్సులివీ.. 

సాంకేతికత అనేది విద్యార్థులు, ఉపాధ్యాయుల మెరుగుదలకు మాత్రమే. వారిని దెబ్బతీయటానికి కాదు. విద్యార్ధుల అభ్యసన అను భవం మెరుగయ్యేందుకు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. సాంకేతికతను అమలు చేయటంలో నేర్చుకునేవారి అవసరాలే ప్రధానం కావాలి. ఉపాధ్యాయులకు అవి సహాయకారిగా ఉండాలి. 

వారు లేకున్నా ఫర్వాలేదన్నట్లు ప్రత్యా మ్నాయం కారాదు. సాంకేతికతతో వ్యక్తిగత వెసులు బాటు బాగున్నా.. సామాజికంగా అది కలిగించే దుష్పరిణామాలను పోల్చి చూసుకొని విధాన నిర్ణ యాలు తీసుకోవాలి. విద్యార్థులు ఆరోగ్యానికి హాని కలగకుండా జాగ్రత్తపడాలి.

వ్యాపార ప్రయోజనాలతోపాటు సామాజిక మేలునూ దృష్టిలో ఉంచుకోవాలి.

స్పల్పకాలిక ప్రయోజనాలకంటే... దీర్ఘకాలంలో నష్టాలనూ బేరీజు వేయాలి.

విద్యార్థులు, ఉపాధ్యాయుల డేటా, గోప్యత రక్షణకు చట్టాలు చేయాలి.
Download the UNESCO GEM 2023 Report PDF Click Here